తిరుపతమ్మకు వెండి శఠగోపం బహూకరణ
ABN , First Publish Date - 2022-08-18T06:01:02+05:30 IST
తిరుపతమ్మకు గుంటూరు జిల్లా లాల్పురం గ్రామానికి చెందిన అరిగెల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు 434 గ్రాముల వెండి శఠగోపాన్ని అందించారు.
పెనుగంచిప్రోలు, ఆగస్టు 17: తిరుపతమ్మకు గుంటూరు జిల్లా లాల్పురం గ్రామానికి చెందిన అరిగెల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు 434 గ్రాముల వెండి శఠగోపాన్ని అందించారు. దాతలకు అమ్మవారి స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలను అందించారు. ఈనెల 19న తిరుపతమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నట్లు ఏఈవో తిరుమలేశ్వరరావు తెలిపారు. పూజా ద్రవ్యాలను దేవస్థానమే సమకూర్చుతుందన్నారు.