వైభవంగా సింహాద్రప్పన్న కల్యాణ మహోత్సవం
ABN , First Publish Date - 2021-04-24T04:35:41+05:30 IST
గవరపాలెం దిబ్బవీధి కొబ్బరితోటలో శ్రీదేవి భూదేవి సమేత వరహాలక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది.
భారీగా తరలి వచ్చిన భక్తజనం
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 23: గవరపాలెం దిబ్బవీధి కొబ్బరితోటలో శ్రీదేవి భూదేవి సమేత వరహాలక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. సింహాద్రప్పన్న ఆలయంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ నిర్వాహకుడు మళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కార్పొరేటర్ కొణతాల నీలిమాభాస్కరరావు, వైసీపీ నాయకులు కొణతాల మురళీకృష్ణ, జాజుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.