సింహాద్రి ఎక్స్ప్రెస్ పాక్షిక రద్దు
ABN , First Publish Date - 2022-07-24T12:50:15+05:30 IST
ఇంజనీరింగ్ పనుల నిమిత్తం సింహాద్రి ఎక్స్ప్రెస్ని ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు గుంటూరు డివిజనల్
గుంటూరు: ఇంజనీరింగ్ పనుల నిమిత్తం సింహాద్రి ఎక్స్ప్రెస్(Simhadri Express)ని ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు గుంటూరు డివిజనల్ రైల్వే అధికారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నెంబరు.17329 గుంటూరు - విశాఖపట్టణం సింహాద్రి ఎక్స్ప్రెస్ సోమవారం నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు సామర్లకోట వరకే నడుస్తుందన్నారు. నెంబరు.17240 విశాఖపట్టణం - గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఈ నెల 26వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు సామర్లకోట నుంచి బయలుదేరి గుంటూరుకు వస్తుందన్నారు. అలానే ఎన్ఐ వర్కులు కారణంగా ఈ నెల 26, ఆగస్టు 2 తేదీల్లో గుంటూరు మీదగా నడిచే నెంబరు.22882 భువనేశ్వర్ - పూణే ఎక్స్ప్రెస్, ఈ నెల 28, ఆగస్టు 4 తేదీల్లో నడిచే పూణే - భువనేశ్వర్ ఎక్స్ప్రెస్లను పూర్తిగా రద్దు చేస్తున్నామన్నారు.