సింగరేణి బొగ్గు కొనుగోలు ప్రక్రియ సరళతరం
ABN , First Publish Date - 2021-07-16T01:18:37+05:30 IST
బొగ్గు కొనుగోలు ప్రక్రియను సింగరేణి సరళతరం చేసింది. కొనుగోలు దరఖాస్తులను ఆన్లైన్లో
కొత్తగూడెం: బొగ్గు కొనుగోలు ప్రక్రియను సింగరేణి సరళతరం చేసింది. కొనుగోలు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించాలని నిర్ణయించింది. రిజిస్టర్డు వినియోగదారుల కోసం సింగరేణి ప్రత్యేక పోర్టల్ను సంస్థ ఈడీ(కోల్ మూమెంట్) శ్రీ ఆల్విన్, జీఎం (మార్కెటింగ్) శ్రీ కె.సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోర్టల్ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో సాంకేతిక వినియోగంలో ఇతర బొగ్గు సంస్థలకు సింగరేణి ఆదర్శంగా ఉందన్నారు.