ఫైనల్లో సింధు X మాల్విక

ABN , First Publish Date - 2022-01-23T08:41:29+05:30 IST

సొంతగడ్డపై జరుగుతున్న సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు అదరగొడుతున్నారు.

ఫైనల్లో సింధు X మాల్విక

సయ్యద్‌ మోదీ ఈవెంట్‌లో భారత షట్లర్ల జోరు

లఖ్‌నవూ: సొంతగడ్డపై జరుగుతున్న సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. మహిళల సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మన షట్లర్లే ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణ, రజతాలను ఖాయం చేసుకున్నారు. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో టాప్‌సీడ్‌ సింధు 21-11తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి ఎవ్‌గెనియా కొసెత్సకాయ (రష్యా) గాయంతో మ్యాచ్‌ మధ్యలోనే వైదొలగింది. దీంతో నేరుగా ఫైనల్‌ చేరిన సింధు భారత్‌కే చెందిన మాల్వికా బన్సోద్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. మరో సెమీ్‌సలో మాల్విక 19-21, 21-19, 21-7తో భారత షట్లర్‌ అనుపమా ఉపాధ్యాయను ఓడించింది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో భారత షట్లర్‌ మిథున్‌ మంజునాథ్‌ 19-21, 21-17, 9-21తో అర్నాడ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌లో భారత జంట పుల్లెల గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ 17-21, 21-8, 21-16తో మలేసియా ద్వయం లో రీన్‌-వాలెరిపై గెలిచి ఫైనల్‌ చేరింది. మిక్స్‌డ్‌లో హేమ నాగేంద్రబాబు-శ్రీవిద్య 15-21, 22-20, 21-9తో అక్షన్‌ శెట్టి-సిమ్రన్‌ సింగ్‌ జంటపై, ఇషాన్‌-తనీషా ద్వయం 18-21, 21-18, 21-11తో అర్జున్‌-ట్రీసా జోడీపై గెలిచి ఫైనల్‌ ఫైట్‌కు సిద్ధమయ్యారు. పురుషుల డబుల్స్‌ సెమీ్‌సలో భారత జోడీ కృష్ణ ప్రసాద్‌-విష్ణువర్ధన్‌ 21-10, 21-9తో ప్రేమ్‌సింగ్‌-రాజేశ్‌ జంటపై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 

Updated Date - 2022-01-23T08:41:29+05:30 IST