సింగపూర్ తెలుగు సమాజం 46వ ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2021-12-03T18:10:13+05:30 IST

సామాజికసేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం మరోసారి రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నవంబర్ 27,28 తేదీల్లో స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించింది.

సింగపూర్ తెలుగు సమాజం 46వ ఆవిర్భావ దినోత్సవం

నవంబర్ 27, 28 తేదీల్లో సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

సింగపూర్ సిటీ: సామాజికసేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం మరోసారి రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నవంబర్ 27,28 తేదీల్లో స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించింది. ఎన్నో ఏళ్లుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. కరోనా సమయంలో తెలుగు సమాజం వరసగా ఆరోసారి విజయవంతంగా నిర్వహించడం విశేషం.


ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. కరోనా నిబంధనలలో భాగంగా రోజుకి 20 మందికి గానూ, రెండు రోజులకి దాదాపు 40 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కాల పరిమితి నిబంధనలు ఉండటం వల్ల చాలా మంది రక్తదానం చేయలేకపోయారు. వారు రక్తదానం చేయాలనుకుంటే తరువాత రోజుల్లో RO284 కోడ్ ఉపయోగించాల్సిందిగా నిర్వాహకులు జూనెబోయిన అర్జునరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజనికి రెడ్ క్రాస్, బ్లడ్ బాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.



Updated Date - 2021-12-03T18:10:13+05:30 IST