ఒకే Bike.. 135 చలానాలు..
ABN , First Publish Date - 2021-12-27T14:27:02+05:30 IST
స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనం ఆపి తనిఖీ చేయగా..
హైదరాబాద్ సిటీ/నార్సింగ్ : గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు ఆదివారం రాత్రి సబితానగర్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ స్ప్లెండర్ ప్లస్ వాహనానికి 135 చలానాలు పెండింగ్ ఉన్నట్టు గుర్తించారు. సిటీ శివారు గండిపేట మండలం సీబీఐటీ కాలేజీ నుంచి ఖానాపూర్ వెళుతున్న టీఎస్13 ఈహెచ్ 2493 స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనం ఆపి తనిఖీ చేయగా 135 చలానాలు పెండింగ్లో ఉన్నాయని ట్రాఫిక్ సీఐ రవికుమార్ తెలిపారు. మొత్తం చలానాలకు రూ.54,195 ఉండగా.. 25 చలానాలకు జరిమానా చెల్లించడంతో వాహనం తిరిగి ఇచ్చామన్నారు.