భక్తులతో కిటకిటలాడిన సింహగిరి
ABN , First Publish Date - 2021-10-17T06:25:12+05:30 IST
రాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి అధిక భక్తులు తరలిరావడంతో శనివారం సింహగిరి కిటకిటలాడింది.
గారడీ బృందాలతో ఆధ్యాత్మిక శోభ
సింహాచలం, అక్టోబరు 16: వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి అధిక భక్తులు తరలిరావడంతో శనివారం సింహగిరి కిటకిటలాడింది. దసరా సెలవులు కావడంతో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం నగరంలో వివాహాలు చేసుకున్న నవదంపతులు తమ కుటుంబ సభ్యులతో సహా అప్పన్న స్వామి దర్శనానికి తరలివచ్చారు. దీంతో కొండదిగువ తొలిపావంచా వద్ద, సింహగిరిపై కేశఖండనశాల, ఉచిత దర్శనం, అతిశ్రీఘ్ర దర్శనం క్యూ లైన్లు, ప్రసాదాల విక్రయాల కౌంటర్లు, అన్నప్రసాద భవనం వద్ద భక్తుల రద్దీ కనిపించింది. పల్లె ప్రాంతాల నుంచి తోటపెద్దులతో వచ్చిన గారిడీ బృందాలు స్వామివారిని కీర్తిస్తూ గానం చేయడంతో సింహగిరిపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.