సామాజిక చైతన్యం నింపిన సిరివెన్నెల పాట

ABN , First Publish Date - 2021-12-06T05:22:00+05:30 IST

ప్రతి పదం, పాటలతో ప్రజల్లో చైతన్యం, అభ్యుదయం నింపిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అని శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.కప్పగంతులు మధుసూదన్‌ అన్నారు.

సామాజిక చైతన్యం నింపిన సిరివెన్నెల పాట
సిరివెన్నెల చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కవులు

సంస్మరణ సభలో వక్తలు

మార్కాపురం(వన్‌టౌన్‌), డిసెంబరు 5 : ప్రతి పదం, పాటలతో ప్రజల్లో చైతన్యం, అభ్యుదయం నింపిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అని శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.కప్పగంతులు మధుసూదన్‌ అన్నారు.  శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో పట్టణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్ర్తి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  సిరివెన్నెల చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో సాధన డిగ్రీ కళాశాల అధ్యాపకులు డా. మంచికంటి శేషుకుమార్‌, వినియోగదారుల సంఘం నా యకులు ఓ.ఎ.మల్లిక్‌, త్రివిక్రమ అభ్యుదయ కళా సంఘం కార్యదర్శులు రంగ నాయ కులు, కవులు కేవీ రమణారెడ్డి, టి.శ్రీనివాసరావు, టీడీ వెంకటేశ్వరరావు, వినోద్‌, ఏడు కొండలు, రాము పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-06T05:22:00+05:30 IST