వైభవంగా సీతారాముల కల్యాణం

ABN , First Publish Date - 2022-07-01T05:40:53+05:30 IST

వాల్మీకిపురం పట్టణం లోని పట్టాభి రామాల యంలో గురువారం టీ టీడీ ఆధ్వర్యంలో సీతా రాముల కల్యాణోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు.

వైభవంగా సీతారాముల కల్యాణం

వాల్మీకిపురం, జూన్‌ 30: వాల్మీకిపురం పట్టణం లోని పట్టాభి రామాల యంలో గురువారం టీ టీడీ ఆధ్వర్యంలో సీతా రాముల కల్యాణోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రతిమా సం నిర్వహించే పునర్వసు వేడుకలలో భాగంగా ఉద యం సుప్రభాత సేవ, ఆలయంలోని మూలవర్లకు అభిషేకం, అర్చన, తోమాలసేవతో ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఆలయ మండపాన్ని మామిడి తోర ణాలు, పుష్పాలంకారణాలతో తీర్చిన కల్యాణ వేదిక, సర్వాంగ సుం దరంగా ముస్తాబైన నూతన వధూవరులు సీతా రాములను పెళ్లి పీటలపై ఆశీనులు గావించారు. మంగళ వాయిద్యాలు, వేదపం డితుల మంత్రోచ్చరణలు, విశేష భక్తజనం నడుమ కల్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. చివరగా హోమం పూర్ణాహుతి కార్యక్ర మాలతో వేడుకల ముగిశాయి.అనంతరం కళ్యాణంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ పట్టువస్త్రాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.  కార్యక్రమాలలో ఆలయ అధికారులు కృష్ణమూర్తి, దిశంత్‌కుమార్‌, అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, ధనుష్‌భట్టార్‌, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-01T05:40:53+05:30 IST