చిన్న పిల్లల ఆస్పత్రికి స్థల పరిశీలన
ABN , First Publish Date - 2021-10-26T07:10:04+05:30 IST
శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని స్వాధీనం చేసుకొని త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేయాలని టీటీడీ ఈవో జవహర్రెడ్డి సూచించారు.
తిరుపతి సిటీ, అక్టోబరు 25: శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని స్వాధీనం చేసుకొని త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేయాలని టీటీడీ ఈవో జవహర్రెడ్డి సూచించారు. చిన్న పిల్లల ఆస్పత్రికోసం రుయా వెనుక వైపున్న ఖాళీ స్థలాన్ని సోమవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనువైన స్థలాన్ని స్వాధీనం చేసుకొని కన్సల్టెంట్లను నియమించి స్థలాన్ని చదును చేసి డిజైన్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వర్రావు, ఎస్టేట్ ఆఫీసర్ మల్లికార్జున, రుయా సూపరింటెండెంట్ భారతి తదితరులు పాల్గొన్నారు.