కృషి విజ్ఞాన కేంద్రానికి స్థల పరిశీలన
ABN , First Publish Date - 2021-07-28T04:50:31+05:30 IST
కృషి విజ్ఞానకేంద్రం ఏర్పాటు కోసం మంగళవారం జేసీ కిషోర్ కుమార్ స్థల పరిశీలన చేశారు. ఎస్ఎస్ఆర్ పేట సమీపంలో ఉన్న 101 సర్వే నెంబర్లో ఉన్న కొండ భూములను పరిశీలించారు.
గుర్ల: కృషి విజ్ఞానకేంద్రం ఏర్పాటు కోసం మంగళవారం జేసీ కిషోర్ కుమార్ స్థల పరిశీలన చేశారు. ఎస్ఎస్ఆర్ పేట సమీపంలో ఉన్న 101 సర్వే నెంబర్లో ఉన్న కొండ భూములను పరిశీలించారు. ఈ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జేసీ తెలిపారు. ఇందుకు సుమారు 50 ఎకరాలు అవసరమని చెప్పారు. తహసీల్దార్ లావణ్య, వ్యవసాయ శాస్త్రవేత్త లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.