ఇంటిగ్రెటెడ్ మార్కెట్ కోసం స్థల పరిశీలన
ABN , First Publish Date - 2021-02-28T06:30:49+05:30 IST
మున్సిపల్ కేంద్రమైన భైంసాలో రూ. 3కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఇంటిగ్రెటెడ్ వ ూర్కెట్ నిర్మాణం కోసం గాను జిల్లా అధికార యంత్రాంగం శనివారం స్థలాలను పరిశీలించింది.
భైంసా, ఫిబ్రవరి 27 : మున్సిపల్ కేంద్రమైన భైంసాలో రూ. 3కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఇంటిగ్రెటెడ్ వ
ూర్కెట్ నిర్మాణం కోసం గాను జిల్లా అధికార యంత్రాంగం శనివారం స్థలాలను పరిశీలించింది. జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడేలు భైంసా మున్సిపల్, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. ముందుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ మిర్చిమార్కెట్ యార్డులో, అనంతరం కాటన్ మార్కెట్యార్డులో స్థలాలను పరిశీలించారు. రెండేకరాల విస్తీర్ణంలో ఆధునిక వసతులు, సౌకర్యాలతో ఏర్పాటు చేసే ఇంటిగ్రెటెడ్ మార్కెట్ కోసం గాను వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన రెండు యార్డులస్థలాలను అధికార బృందం పరిశీలించింది. సంబంధిత రెండు స్థలాల నివేదికలను రూపోందించి ప్రభుత్వానికి అందజేయాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికార యంత్రాంగానికి సూచించారు. చీఫ్ సెక్రెటరీ ఆదేశాల మేరకు స్థలాల పరిశీలన జరిగిందని జిల్లా అధికార యంత్రాంగం పేర్కోంది. ఇందులో మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, మున్సిపల్, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.