కనులపండువగా రాములోరి కల్యాణం

ABN , First Publish Date - 2021-04-22T06:07:57+05:30 IST

కనులపండువగా రాములోరి కల్యాణం

కనులపండువగా రాములోరి కల్యాణం
సీతారాముల శాంతి కల్యాణం

 ఫనిరాడంబరంగా శ్రీరామనవమి వేడుకలు

 ఫపలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

పెనమలూరు, ఏప్రిల్‌ 21: శ్రీరామనవమిని పురస్క రించుకుని పెనమలూరులోని రామాలయాల్లో సీతారాముల కల్యాణం కనులపండువగా నిర్వహించారు. యనమలకు దురు  రామలింగేశ్వరస్వామి ఆలయంలోని పార్వతీ అమ్మ వారికి కుంకుమ పూజలు నిర్వహించారు. దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద ఉత్సవమూర్తులకు పంచా మృతాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారాముల  శాంతి కల్యాణం జరిపారు. కార్యక్రమాలలో ఆలయ అర్చకులు జీవీఆర్‌ సాగర్‌, లక్ష్మీనారాయణ, పూర్ణచంద్రరావు, ఈవో బి. గంగాధరరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ కాలనీలో...

భారతీనగర్‌  : గుణదల ఎన్టీఆర్‌ కాలనీలోని రామాల యంలో తాటి ఆకుల చలువ పదిరిలో సీతారామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వెలగపూడి వీరరాఘవ, విమలాదేవి, అడుసుమల్లి శ్రీకాంత్‌, వినీలాదేవి దంపతులు కల్యాణంలో కూర్చున్నారు. ఎన్టీఆర్‌, వెటర్నరీ, సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీలతోపాటు సమీప కాలనీల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వెలగపూడి వీర రాఘవ, విమలాదేవి దంపతులు రామాలయానికి రెండు లక్షల నూట పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు. 

అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి

రామలింగేశ్వరనగర్‌  : శ్రీరామనవమి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టా లని బొప్పన భవకుమార్‌ పిలుపునిచ్చారు. పటమట అచ్చ మ్మ బజార్‌లో అమాం రవి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెన్ను శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు.

 చినకంచిలో..

విజయవాడ రూరల్‌  : సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు విజయవాడ రూరల్‌ మండలంలో బుధవారం వైభవంగా జరిగాయి. గ్రామాల్లోని రామాలయాల్లో కొవిడ్‌ నిబంధనల మేరకు సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. నున్న చినకంచిలోని చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆలయంలో భద్రాద్రి తరహాలో కల్యాణం నిర్వహించారు. చినకంచిలో ట్రస్టీ మొక్కపాటి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గౌడ రామాలయం, తూర్పు రామాలయం, పటమట రామాలయం, బోడపాడు, జడ్పీ హైస్కూల్‌ సమీపంలోని రామాలయాల్లోనూ రాములోరి కల్యాణోత్సవాలు జరిగాయి. పాతపాడు, పీ నైనవరం, మంగళాపురం, అంబాపురంలోని ఆలయాల్లోనూ సీతారాముల కల్యాణం జరిగింది.   కొత్తూరు గౌడ రామాలయంలో, తాడేపల్లి, జక్కంపూడి రామాలయాలలో సీతారాముల కల్యాణం నిర్వహించారు.

ఉయ్యూరులో..

ఉయ్యూరు  : సీతారామ కల్యాణం వాడవాడలా కనుల పండువగా జరిపారు. రామాలయాలు, ఆంజనేయస్వామి మందిరాల్లో సీతారామ కల్యాణాన్ని  వైభవంగా నిర్వహిం చారు. హనుమాన్‌నగర్‌ అభయాంజనేయ స్వామి ఆలయం లో జరిగిన కల్యోణోత్సవంలో పలువురు దంపతులు పాల్గొన్నారు.

 గన్నవరంలో..

గన్నవరం : మండలంలో శ్రీరామనవమిని భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లోని రామాలయాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు పూజలు చేశారు. స్థానిక రజక రామాలయంలో చిక్కవరపు హరీష్‌బాబు, శిరీషా దంపతులు పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణం జరిపించారు. చిక్కవరం శ్రీ క్షేత్ర హనుమత్‌పురంలో ఆంజనేయ స్వామి రామచంద్రస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు పాలపొంగళ్లు సమర్పించారు.  సూరంపల్లి పెరికే రామాలయంలో పూజలు జరిగాయి.

హనుమాన్‌ జంక్షన్‌లో.. 

 హనుమాన్‌ జంక్షన్‌ :  జంక్షన్‌లోని పలు రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలను బుధవారం నిర్వహించారు.  హనుమాన్‌జంక్షన్‌ సెంటర్‌లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. సెంటర్‌లోని రామాలయంలో కల్యాణం నిర్వహించారు. హనుమాన్‌నగర్‌, బాపులపాడు రామాలయాలు, ఏపూరు ఆంజనేయస్వామి ఆలయంలో నవమి వేడుకలను నిర్వహించారు.

రూరల్‌లో..

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : మండల వ్యాప్తంగా  రామా లయాల్లో బుధవారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. వీరవల్లి షిరిడిసాయిబాబా ఆలయ ఆవరణలో అర్చకులు వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారామ కల్యాణ మహోత్సవంలో మోటూరి సత్యనారా యణ వరలక్ష్మి దంపతులు, లంక హేమంత్‌ రమ్య దంపతు లు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  పెరికీడు సీతా రామస్వామి ఆలయంలో నూకల నాగ కార్తీక్‌ శ్రావణి దంపతులు, వలివేటి ఆది వెంకట శ్రీనివాసు జ్యోతి దంప తులు కల్యాణం నిర్వహించారు. కాకులపాడు కోదండ రామస్వామి ఆలయంలో పి.వి.రమణ దంపతులు, జె.శేషగిరి రావు దంపతులు స్వామి వారి కల్యాణం నిర్వహించారు.  రంగన్నగూడెం పురాతన రామమందిరంలో సర్పంచ్‌ కసుకుర్తి రంగామణి అర్జునరావు దంపతులు, ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, పుసులూరి లక్ష్యీనారాయణ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆరుగొలను, కొత్తపల్లి,  రేమల్లె, సిరివాడ, అంపాపురం తదితర గ్రామాలలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. 

ఉంగుటూరు మండలంలో..

ఉంగుటూరు  : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం మండలంలోని పలు రామాలయాల్లో శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు.   పెదఅవుటపల్లి  సీతారామస్వామి దేవస్థానంలో ఆలయ ఈవో సీతారామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో ఆలయ వంశపారంపర్య ఽధర్మకర్త అవుటపల్లి వెంకటసత్యరామబ్రహ్మం కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆత్కూరు, ఉంగుటూరు, మానికొండ, తరిగొప్పల, తేలప్రోలు, ఎలుకపాడు, గారపాడు, ఆముదాలపల్లి, ముక్కపాడు, ఇందుపల్లి, వెల్దిపాడు, పొణుకుమాడుల్లో ఆలయ కార్యనిర్వహణాధికారులు శ్రీనివాస్‌, ప్రకృతాంబ, నాగిరెడ్డి పర్యవేక్షణ లో రాములోరి కల్యాణోత్సవం వైభవంగా  నిర్వహించారు. 

Updated Date - 2021-04-22T06:07:57+05:30 IST