Gujarat accident : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం...ఆరుగురి మృతి
ABN , First Publish Date - 2022-08-12T13:09:37+05:30 IST
రక్షా బంధన్ పండుగ(Rakshabandhan) సందర్భంగా విషాద ఘటన జరిగింది....
ఆనంద్(గుజరాత్):రక్షా బంధన్ పండుగ(Rakshabandhan) సందర్భంగా విషాద ఘటన జరిగింది. రాఖీలు కట్టేందుకు వెళ్లి వస్తున్న వారు రోడ్డు ప్రమాదంలో(accident) మృత్యువు పాలయ్యారు. గుజరాత్(Gujarat’s Anand) రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు.(Six people died in an accident) ఆనంద్ జిల్లా( Anand district) సోజిత్రా తహసీల్ పరిధిలోని దాలీ గ్రామంలో వేగంగా వస్తున్న కారు ఆటోరిక్షా, మోటారుబైక్లను(car rammed into an auto rickshaw and motorbike) ఢీకొట్టింది.
ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు.ఈ ప్రమాదంలో ఆటోరిక్షాలో ఉన్న నలుగురు, బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవరు తీవ్రంగా గాయపడటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.కారు వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ గుప్తా చెప్పారు.