ఆరు ఇళ్లు దగ్ధం
ABN , First Publish Date - 2022-01-21T05:35:47+05:30 IST
పూసపాటిరేగ మండలం వెంపడం పంచాయతీ తాళ్లపేటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు గృహాలు దగ్ధమై సుమారు రూ.8లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
రూ.8లక్షల ఆస్తి నష్టం
భోగాపురం (పూసపాటిరేగ), జనవరి 20: పూసపాటిరేగ మండలం వెంపడం పంచాయతీ తాళ్లపేటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు గృహాలు దగ్ధమై సుమారు రూ.8లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన పి.ఉమ ఇంట్లో ప్రమాద వశాత్తు షార్టుసర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో సమీపంలో ఉన్న పిన్నింటి నారాయణ మ్మ, పిన్నింటి సూర్యుడు, వాలి నరసమ్మ, వాలి అష్టప్ప, వాలి కామమ్మ తాటాకు గృహాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అయితే స్థానికులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించినా మంటలు చెలరేగడంతో చేసేదేమీలేక చూస్తూ ఉండి పోయారు. దీంతో బాధితులు సర్వం కోల్పోయి రోదిస్తున్నారు. ఈ ప్రమాదంతో సుమారు రూ.8లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. స్థానికుల సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. విషయం తెలుసుకొన్న ఎస్ఐ జయంతి సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తహసీల్దార్ కృష్ణమూర్తి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని ఆస్తినష్టం అంచనా వేశారు.