రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు

ABN , First Publish Date - 2022-07-02T05:48:59+05:30 IST

మండలంలోని నెలివాడ జంక్షన్‌కు సమీపంలో జాతీయ రహదారి పై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాల య్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు

బొండపల్లి: మండలంలోని నెలివాడ జంక్షన్‌కు సమీపంలో జాతీయ రహదారి పై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాల య్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ రవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. పాచిపెంట మండలం కేశలి గ్రామానికి చెందిన ఆటోలో నలుగురు విశాఖ పట్టణం వెళుతుండగా, విజయనగరం నుంచి కుంటినవలస వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మీసాల మోహనరావు, వసంత రాము, కిర్ల స్వాతి, గాడి జానికిరాంలకు గాయాలయ్యాయి. ఇందులో జానకిరాం పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని 108 వాహనంలో విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

 

Updated Date - 2022-07-02T05:48:59+05:30 IST