ఆరుగురు బైక్ దొంగల అరెస్టు
ABN , First Publish Date - 2021-07-27T04:11:43+05:30 IST
సూళ్లూరుపేట పోలీసులు సోమవారం ఆరుగురు మోటారు బైక్ల దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 8 లక్షల విలువచేసే 11 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వారిలో ముగ్గురు బాలురు
11 మోటారు సైకిళ్ల స్వాధీనం
సూళ్లూరుపేట, జూలై 26 : సూళ్లూరుపేట పోలీసులు సోమవారం ఆరుగురు మోటారు బైక్ల దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 8 లక్షల విలువచేసే 11 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో నిందితుల వివరాలను వెల్లడించారు. సూళ్లూరుపేట బాపూజీకాలనీకి చెందిన కంకి వంశీ (21), యనమల లీలాగణేష్ (19), అటకానితిప్పకు చెందిన కంకి లక్ష్మణకుమార్ (20)లతోపాటు ముగ్గురు బాలురు మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడేవారన్నారు. వారు జిల్లాతోపాటు చెన్నైలో కూడా బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి సారథ్యంలో ఎస్ఐలు ఉమాశంకర్, శ్రీనివాసులురెడ్డి బృందంగా ఏర్పడి నిఘావేసి నిందితులను పట్టుకున్నారని డీఎస్పీ చెప్పారు. దర్యాప్తులో పాల్గొన్న ఏఎస్ఐ జ్ఞానశేఖర్, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు రామచంద్రయ్య, ప్రతాప్, రమేష్, వలంటీర్ తేజలను ఆయన అభినందించారు.