యువతిని మోసగించిన ఘటనలో ఆరుగురిపై కేసు
ABN , First Publish Date - 2021-03-09T07:01:45+05:30 IST
ఓ యువతికి మాయమాటలు చెప్పి ఓ యువకుడు అత్యాచారం చేశాడు. అతనికి సోదరుడైన ఓ ప్రజా ప్రతినిధి గన్మన్ సహకరిం చాడు.
నిందితుల్లో ఒకరు ప్రజా ప్రతినిధి గన్మన్
ఏలూరు క్రైం, మార్చి 8 : ఓ యువతికి మాయమాటలు చెప్పి ఓ యువకుడు అత్యాచారం చేశాడు. అతనికి సోదరుడైన ఓ ప్రజా ప్రతినిధి గన్మన్ సహకరిం చాడు. వీరితో పాటు మరో నలుగురిపై ఎస్సీ అట్రాసిటీ కేసు, ఆ యువకుడిపై అత్యాచారం కేసు నమోదైంది. ఏలూరులోని ఓ ప్రాంతానికి చెందిన యువతి (22)ని ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన వీరవల్లి నాగబాబు, ఏలూరు పోలీస్ క్వార్టర్స్లో ఉంటున్న తన సోదరుడు వీరవల్లి సత్యనారాయణ ఇంటికి వచ్చి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ యువతిని పరిచయం చేసుకుని ఏలూరులోని ఓ ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకుంటానని ఏలూరు రూరల్ మండలం పాలగూడెం తీసుకెళ్లి బౌద్ధ ట్రస్టులో తాళి కట్టాడు. అనంతరం ఆమెను తంగెళ్ళమూడి ప్రాంతంలో కొట్టి ఆ యువకుడి సోదరుడైన ఓ ప్రజాప్రతినిధి గన్మన్ అయిన వీరవల్లి సత్యనారాయణ, వారి బంధువులు కొట్టి దుర్భాషలాడి కులం పేరుతో దూషించారు. దీంతో బాధితురాలు జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలియజేసి ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ యువకుడితోపాటు అతని సోదరుడైన గన్మన్ వీరవల్లి సత్యనారాయణ, మరో నలుగురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆ యువకు డు అత్యాచారం చేయడానికి సహకరించారని కేసు నమోదైంది. దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కె.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.