ఆరుగురు నిందితుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-22T04:50:50+05:30 IST

ఆర్టీసీ బస్టాండు వద్ద ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ మైనుద్దీన్‌ తెలిపారు.

ఆరుగురు నిందితుల అరెస్ట్‌

చిన్నమండెం, జనవరి 21: ఆర్టీసీ బస్టాండు వద్ద ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ మైనుద్దీన్‌ తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం... చిన్నమండెంలో వేల్పుల ఆంజనేయులు అలియాస్‌ దాబా అంజి డాబా నిర్వహిస్తున్నాడు. డాబాలో తమిళనాడుకు చెందిన ఇద్దరు కూలీలు పని చేసేవారు. వీరు పనికి రాలేదని తన అనుచరుల తో కలిసి రెండు నెలల కిందట దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా శుక్రవారం ఆర్టీసీ బస్టాండు వద్ద నిందితులు దాబా అంజి సహా వేల్పుల మణికంఠ, లవకుమార్‌, వేల్పుల అనిల్‌, విజయ్‌కుమార్‌, రెడ్డిప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండుకు పెట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఇద్దరు నిందితులున్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. 


Updated Date - 2022-01-22T04:50:50+05:30 IST