Kolkata ఐఐఎంలో 61 మంది విద్యార్థులకు కరోనా
ABN , First Publish Date - 2022-01-04T18:39:54+05:30 IST
కోల్కతా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో 61 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది...
కోల్కతా: కోల్కతా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో 61 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. జోక క్యాంపస్ హాస్టళ్లలో విద్యార్థులకు కరోనా రావడంతో వారిని గెస్ట్ హౌస్ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఐఐఎంలో తరగతులను రద్దు చేశారు. రామానుజన్, లేక్ వ్యూ న్యూహాస్టల్, టాటా హాళ్లలోని విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో హాస్టళ్లను కంటైన్మెంటు జోన్ గా ప్రకటించారు. కరోనా వ్యాప్తిచెందకుండా ఐఐఎం క్యాంపస్ కు సీలు వేశారు. ఐఐఎంలో కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ప్రొఫెసర్ మనీష్ ఠాకూర్ చెప్పారు. ఖరగ్ పూర్ ఐఐటీలోని పలువురు విద్యార్థులకు కూడా కరోనా సోకింది. అసుతోష్ ముఖర్జీ హాలులో విద్యార్థులకు కరోనా రావడంతో వారికి చికిత్స అందించేందుకు క్వారంటైన్ చేశామని ఖరగ్ పూర్ ఐఐటీ అధికారులు చెప్పారు.