వైసీపీ మంత్రులకు చర్మం మందం: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2022-04-08T02:46:16+05:30 IST
వైసీపీ మంత్రులకు చర్మం మందమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
పార్వతీపురం: వైసీపీ మంత్రులకు చర్మం మందముగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వారికి సామాజిక స్పృహ చాలా తక్కువని ఆయన ఎద్దేవా చేశారు. ఉప ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన పుష్పశ్రీవాణి ఎన్ఆర్జీఎస్ నిధులతో అంతఃపురం లాంటి సొంత భవనం కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల తలుపులు ఎత్తటానికి అయ్యే ఖర్చుకి నిధులు కూడా తేలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.