రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-10-30T11:35:14+05:30 IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

టెక్కలి, అక్టోబరు 29: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వైఎస్‌ఆర్‌ రైతుభరోసా రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లా డుతూ.. వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కింద నియోజకవర్గంలో 41,853మంది రైతులు లబ్ధి పొందారన్నారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి ఏఎంసీ చైర్మన్‌ గున్నమ్మ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు బాడాన మురళి, ఏడీఏ బీవీ తిరుమల రావు, మండల ప్రత్యేకాధికారి డాక్టర్‌ మంచు కరుణాకరరావు, ఇన్‌చార్జి తహసీల్దార్‌ గణపతి, ఎంపీడీవో పి.నారాయణమూర్తి, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:35:14+05:30 IST