హోం మంత్రికి ఘనస్వాగతం
ABN , First Publish Date - 2020-10-30T11:27:44+05:30 IST
ఉప ముఖ్యమంత్రి ధర్మాన ఽకృష్ణదాస్ స్వగ్రామం మబగాంనకు తొలిసారిగా విచ్చేసిన హోంమంత్రి మేకతోటి సుచరితకు ఘన స్వాగతం పలికారు.
మబగాం(పోలాకి), అక్టోబరు 29: ఉప ముఖ్యమంత్రి ధర్మాన ఽకృష్ణదాస్ స్వగ్రామం మబగాంనకు తొలిసారిగా విచ్చేసిన హోంమంత్రి మేకతోటి సుచరితకు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, వైసీపీ మహిళా విభాగం నాయకురాలు పద్మప్రియ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆమె పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆమె సమావేశమయ్యారు. కృష్ణదాస్ స్థానిక నాయకులను ఆమెకు పరిచయం చేశారు. అనంతరం అక్కడే అల్పాహారం చేసి జిల్లా కేంద్రంలోని కార్యక్రమానికి పయనమయ్యారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, గొర్లె కిరణ్కుమార్, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు తిలక్, సూరిబాబు, శ్రీకాంత్, డీఎస్పీ శివరామిరెడ్డి, ఎస్ఐ చిన్నంనాయుడు, తహసీల్దార్ ఎ.సింహాచలం, ఎంపీడీవో ఉరిటి రాధాకృష్ణ, పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు, నాయకులతో మంత్రి సమీక్షకు విలేఖరులను అనుమతించలేదు.
మడపాం వద్ద..
నరసన్నపేట: రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకపాటి సుచరితకు నరసన్నపేట నియోజకవర్గ ముఖద్వారం మడ పాం వద్ద డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ గురువారం ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నియోజక వర్గ వైసీపీ నాయకులు ధర్మాన పద్మప్రియ, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.