మోదీకి రాసే బహిరంగ లేఖలో రైతుల పెండింగ్ డిమాండ్లను లేవనెత్తుతాం: బల్బీర్ సింగ్

ABN , First Publish Date - 2021-11-22T01:17:30+05:30 IST

మోదీకి రాసే బహిరంగ లేఖలో రైతుల పెండింగ్ డిమాండ్లను లేవనెత్తుతాం: బల్బీర్ సింగ్

మోదీకి రాసే బహిరంగ లేఖలో రైతుల పెండింగ్ డిమాండ్లను లేవనెత్తుతాం: బల్బీర్ సింగ్

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాయనున్న బహిరంగ లేఖలో రైతుల పెండింగ్ డిమాండ్లను లేవనెత్తుతామని రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. సరిహద్దులో కోర్ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ మాట్లాడారు. తాము ప్రధానమంత్రికి బహిరంగ లేఖ రాస్తామని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్‌పీకి చట్టబద్ధమైన హోదా కల్పించడంపై ఏర్పాటు చేయబోయే కమిటీపై వివరణ కోరుతామని బల్బీర్ సింగ్ తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు నవంబర్ 19న మోదీ ప్రకటించారు. నవంబర్ 29న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా రద్దు ప్రతిపాదనను పార్లమెంటు ముందుకు తీసుకువెళ్లనుంది.

Updated Date - 2021-11-22T01:17:30+05:30 IST