Sky Walk: అక్టోబరులో అందుబాటులోకి కాలినడక వంతెన
ABN , First Publish Date - 2022-08-10T14:39:37+05:30 IST
స్థానిక టి.నగర్ బస్టాండ్ -రైల్వేస్టేషన్ను అనుసంధానం చేసేలా నిర్మిస్తున్న కాలినడక వంతెన (స్కై వాక్) అక్టోబరులో ప్రజలకు అందుబాటులోకి రానుందని
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 9: స్థానిక టి.నగర్ బస్టాండ్ -రైల్వేస్టేషన్ను అనుసంధానం చేసేలా నిర్మిస్తున్న కాలినడక వంతెన (స్కై వాక్) అక్టోబరులో ప్రజలకు అందుబాటులోకి రానుందని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్(Mayor of Greater Chennai Corporation) ప్రియ తెలిపారు. నగరంలో నిర్మాణంలో ఉన్న విల్లివాకం, ఎలిఫెంట్ గేట్, చింతాద్రిపేట ఫ్లై ఓవర్ను మేయర్ మంగళవారం జీసీసీ కమిషనర్ గగన్దీప్సింగ్ బేదీ(Gagandeep Singh Bedi), డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్లతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దుకాణాల అద్దె బకాయిలున్న యజమానులకు నోటీసులు అందజేయనున్నామన్నారు. స్పందించకపోతే దుకాణాలకు సీలు వేస్తామని మేయర్ హెచ్చరించారు.