పాఠశాల నుంచి గ్రానైట్ పలకల తరలింపు అడ్డగింత
ABN , First Publish Date - 2020-12-04T05:16:01+05:30 IST
మండలంలోని జోగంపేట ప్రాథమిక పాఠశాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా గ్రానైట్ పలకలు తరలిస్తుం డడాన్ని పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ వనుం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిటికెల వరహాబాబు ఆధ్వర్యంలో పలువురు గ్రామస్థులు గురువారం సాయంత్రం అడ్డుకున్నారు.
‘నాడు- నేడు’ పనుల కోసం జోగంపేట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కొనుగోలు
పనులు పూర్తి కాకుండానే విక్రయించడంతో గ్రామస్థులు అభ్యంతరం
గొలుగొండ, డిసెంబరు 3 : మండలంలోని జోగంపేట ప్రాథమిక పాఠశాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా గ్రానైట్ పలకలు తరలిస్తుం డడాన్ని పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ వనుం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిటికెల వరహాబాబు ఆధ్వర్యంలో పలువురు గ్రామస్థులు గురువారం సాయంత్రం అడ్డుకున్నారు. ఈ పాఠశాలలో నాడు- నేడులో భాగంగా చేపట్టే పనుల కోసం హెచ్ఎం ఈ పలకలను కొనుగోలు చేశారు. అయితే పనులు పూర్తి కాకుండానే హెచ్ఎం వీటిని విక్రయించడంతో సాయంత్రం వ్యాన్లో గ్రానైట్ పలకలను సదరు యజామాని ఎక్కించారు. ఈ విషయం తెలుసు కున్న గ్రామస్థులు పేరెంట్స్ కమిటీ చైర్మన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లారు. దీంతో ఆయన వచ్చి అడ్డగించారు. దీనిపై ఇన్చార్జి ఎంఈవో అమృత్కుమార్ను వివరణ కోరగా, గ్రానైట్ తరలింపుపై తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఎస్ఐ నారాయ ణరావు వాహనాన్ని స్వాధీనం పర్చుకుని స్టేషన్కు తరలించారు.