చిన్న వానకే నీట మునిగిన పల్లె ప్రకృతి వనం
ABN , First Publish Date - 2022-06-30T05:28:46+05:30 IST
మంగళవారం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికే కందిలోని పల్లెప్రకృతి వనం నీటితో నిండిపోయింది.
కంది: మంగళవారం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికే కందిలోని పల్లెప్రకృతి వనం నీటితో నిండిపోయింది. బుధవారం ఉదయానికి అందులోని వివిధ రకాల మొక్కలు, ఆట వస్తువులు, రోడ్లు మొత్తం నీట మునిగాయి. కాగా ఈ పల్లెపకృతి వనాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్-2) రోజునే హోం మంత్రి మహమూద్ అలీ అట్టహాసంగా ప్రారంభించారు. లక్షల రూపాయల పంచాయతీ నిధులను ఖర్చు చేసి సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దిన పల్లె ప్రకృతివనం నీటి పాలైంది.