రూ.198 కోట్ల స్మార్ట్ సిటీ నిధుల రాక
ABN , First Publish Date - 2020-10-27T07:16:01+05:30 IST
కాకినాడ స్మార్ట్ సిటీకి కేంద్రం నుంచి మంజూరైన రూ.198 కోట్లను గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా నిలుపుదల చేసింది.
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ),అక్టోబరు 26: కాకినాడ స్మార్ట్ సిటీకి కేంద్రం నుంచి మంజూరైన రూ.198 కోట్లను గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా నిలుపుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ నిధుల విడుదలపై ఆంక్షలు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిధులు విడతల వారీగా ప్రభుత్వం నుంచి విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి మున్సిపల్ పరిపాలనా శాఖ జీవో నంబరు 474 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.