పానీపూరీ ఎలావుందని స్మృతి ఇరానీని అడగగానే....

ABN , First Publish Date - 2021-03-01T12:59:10+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ...

పానీపూరీ ఎలావుందని స్మృతి ఇరానీని అడగగానే....

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ... ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో పానీపూరీ తింటూ కెమెరా కంటికి చిక్కారు. పానీపూరీ ఎలా ఉందని ఆమెను మీడియా అడగగా... ‘హరహర మహాదేవ్’ అంటూ చిరునవ్వులు చిందించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్ట్రీట్ ఫుడ్‌ను తెగ ఇష్టపడతారు. ఆమెకు వారణాసి గోల్‌గప్పే(పానీపూరీ) అంటే ఎంతో ఇష్టం. 


వారణాసి వచ్చిన ఆమె కచహరీ ప్రాంతంలోని ఒక స్ట్రీట్ ఫుడ్ దుకాణానికి చేరుకుని, పానీ పూరీని ఎంతో ఇష్టంగా తిన్నారు. ఈ సమయంలో ఆమెను చూసినవారు, ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆరాటపడ్డారు. ఆమె వారికి సహకరిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ఆమెను పానీపూరీ ఎలా ఉందని అడగగా ‘హరహర మహాదేవ్’ అంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. అలాగే ’ఆరోగ్యంగా ఉండండి... ఆనందంగా ఉండండి’ అని కూడా అన్నారు. కాగా స్మృతి ఇరానీ వారణాసిలో జరిగిన బీజేపీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. 

Updated Date - 2021-03-01T12:59:10+05:30 IST