అదరగొట్టిన మంధాన, షఫాలీ
ABN , First Publish Date - 2022-07-05T09:59:34+05:30 IST
పేసర్ రేణు క సింగ్ (4/28) కెరీ ర్ బెస్ట్ బౌలింగ్తోపాటు ఓపెనింగ్ జోడీ స్మృతి మంధాన (83 బంతుల్లో 94 నాటౌట్), షఫాలీ వర్మ (71 బంతుల్లో 71 నాటౌ ట్) అర్ధ శతకాలతో
రేణుకకు 4 వికెట్లు
10 వికెట్లతో భారత్ ఘన విజయం
పల్లెకెలె: పేసర్ రేణు క సింగ్ (4/28) కెరీ ర్ బెస్ట్ బౌలింగ్తోపాటు ఓపెనింగ్ జోడీ స్మృతి మంధాన (83 బంతుల్లో 94 నాటౌట్), షఫాలీ వర్మ (71 బంతుల్లో 71 నాటౌ ట్) అర్ధ శతకాలతో విరుచుకుపడడంతో.. సోమవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 వన్డేల సిరీ్సను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకొంది. 174 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు తొలి వికెట్కు అభేద్యంగా 174 పరుగులు జోడించడంతో.. భారత్ 25.4 ఓవర్లలో అలవోకగా నెగ్గింది. ఈ క్రమంలో మహిళల వన్డేల్లో వికెట్ కోల్పోకుండా అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డులకెక్కింది.