కృష్ణంరాజు పేరిట స్మృతివనం: రోజా

ABN , First Publish Date - 2022-09-30T09:57:07+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నటుడు యు.వి.కృష్ణంరాజు సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొగల్తూరు సమీప సముద్రతీరంలో రెండెకరాల స్థలం కేటాయించి స్మృతి వనం నిర్మిస్తామని ఏపీ టూరిజం మంత్రి ఆర్‌కే రోజా ప్రకటించారు.

కృష్ణంరాజు పేరిట స్మృతివనం: రోజా

మొగల్తూరులో ప్రభుత్వం తరఫున 2ఎకరాలు

భీమవరం/మొగల్తూరు, సెప్టెంబరు 29: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నటుడు యు.వి.కృష్ణంరాజు సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొగల్తూరు సమీప సముద్రతీరంలో రెండెకరాల స్థలం కేటాయించి స్మృతి వనం నిర్మిస్తామని ఏపీ టూరిజం మంత్రి ఆర్‌కే రోజా ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో గురువారం కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి రోజా, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని, సినీ హీరో ప్రభా్‌సను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ప్రభా్‌సను కృష్ణంరాజు కుటుంబాన్ని కలిసి పరామర్శించినట్లు తెలిపారు. 

Updated Date - 2022-09-30T09:57:07+05:30 IST