పాము కాటుతో బాలుడు మృతి

ABN , First Publish Date - 2021-06-22T06:58:39+05:30 IST

పిల్లలతో కలిసి ఆటలాడుకుంటూ గోడల నెర్రెలలో చెయ్యి పెట్టిన బాలుడు పాము కాటు వేయడంతో మృతిచెందాడు. సోమవారం మండలంలోని కొమ్మినేనివారిపాలెంలో జరిగిన ఈ సంఘటనలో ముద్దపాటి ఉదయగోపి (10) మృతి చెందాడు. గ్రామానికి చెందిన ముద్దపాటి వెంకటేశ్వర్లు, నాగమణి దంపతులుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ఉదయ గోపి రోజు మాదిరిగానే తన ఇంటి వద్ద ఆడుకుంటూ పాత గోడలలో చెయ్యి పెట్టగా చేతికి చిన్నపాటి గాయం అయింది.

పాము కాటుతో బాలుడు మృతి
బాలుడి మృత దేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు

బల్లికురవ, జూన్‌ 21: పిల్లలతో కలిసి ఆటలాడుకుంటూ గోడల నెర్రెలలో చెయ్యి పెట్టిన బాలుడు పాము కాటు వేయడంతో మృతిచెందాడు. సోమవారం మండలంలోని కొమ్మినేనివారిపాలెంలో జరిగిన ఈ సంఘటనలో ముద్దపాటి ఉదయగోపి (10) మృతి చెందాడు. గ్రామానికి చెందిన ముద్దపాటి వెంకటేశ్వర్లు, నాగమణి దంపతులుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ఉదయ గోపి రోజు మాదిరిగానే తన ఇంటి వద్ద ఆడుకుంటూ పాత గోడలలో చెయ్యి పెట్టగా చేతికి చిన్నపాటి గాయం అయింది. గొడ రాయి గీసుకు పోయిందని భావించిన వారి కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. కొంత సేపటి తరువాత బాలుడి నోటి నుంచి నురుగు రావటంతో గోడలో పాము కాటు వేసి ఉంటుందని వెంటనే బాలుడిని వారి కుటుంబసభ్యులు అద్దంకి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఒక్కాగానొక్క కుమారుడిని అలా ్లరు ముద్దుగా పెంచుకొంటున్నామని, పాము కాటు రూపంలో తమను దిక్కులేని వాడిని చేసి పోయాడని  బాలుడి తల్లిదండ్రుల రోదనలు చూపరులను కన్నీరు పెట్టించాయి. బాలుడి మృతితో కొమ్మినేనివారిపాలెంలో విషాదఛాయలు అలు ముకున్నాయి.


Updated Date - 2021-06-22T06:58:39+05:30 IST