Shocking! కాటేసిందనే కోపంతో పామును ముక్కలుగా నరికిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2022-06-26T18:02:43+05:30 IST

ఎప్పటిలాగే అతడు పొలానికి వెళ్లాడు. అక్కడ పని పూర్తైన తర్వాత తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ఓ విష సర్పం కాటేసింది. దీంతో అతడు ఆగ్రహానికి లోనయ్యాడు. కటేసిన పామును బంధిం

Shocking! కాటేసిందనే కోపంతో పామును ముక్కలుగా నరికిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు!

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే అతడు పొలానికి వెళ్లాడు. అక్కడ పని పూర్తైన తర్వాత తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ఓ విష సర్పం కాటేసింది. దీంతో అతడు ఆగ్రహానికి లోనయ్యాడు. కటేసిన పామును బంధించి.. దాన్ని ముక్కలు ముక్కలు నరికేశాడు. అనంతరం ఆ ముక్కలను తినేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే పూర్తి వివరాలపై ఓ లుక్కేస్తే..



ఉత్తరప్రదేశ్‌కు చెందిన మతబాదల్ సింగ్ అనే వ్యక్తి ఎప్పటిలాగే ఓ పని మీద పొలానికి వెళ్లాడు. అక్కడ పని పూర్తైన అనంతరం ఇంటికి బయల్దేరాడు. మార్గ మధ్యంలో అతడిని ఓ విషసర్పం కాటేసింది. దీంతో అతడు కోపంతో ఊగిపోయాడు. వెంటనే దాన్ని పట్టుకుని.. ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అనంతరం ఆ ముక్కలను తినేసి.. ఇంటికి చేరుకున్నాడు. అతడి చేతులకు రక్తం మరకలు ఉండటంతో కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో అతడు.. విషయం మొత్తం చెప్పేశాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా.. ప్రస్తుతం మతబాదల్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు సమాచారం. 


Updated Date - 2022-06-26T18:02:43+05:30 IST