దొంగ ఓటు వేస్తూ దొరికిన తుమ్మింద వాసీ
ABN , First Publish Date - 2021-04-18T07:36:14+05:30 IST
తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో దొంగ ఓటు వేస్తూ చిత్తూరు మండలం తుమ్మింద గ్రామానికి చెందిన జగదీష్ అడ్డంగా దొరికిపోయాడు.
చిత్తూరు రూరల్, ఏప్రిల్ 17: తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో దొంగ ఓటు వేస్తూ చిత్తూరు మండలం తుమ్మింద గ్రామానికి చెందిన జగదీష్ అడ్డంగా దొరికిపోయాడు. చిత్తూరు మండలం నుంచి సుమారు ఐదు వందల మందికి పైగా దొంగ ఓట్లు వేసేందుకు వెళ్లారు. వీరికి అధికార పార్టీ నాయకులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి తరలించినట్లు సమాచారం. ఉదయం తిరుపతిలో దొంగ ఓట్లు వేస్తున్న ఇతన్ని బీజేపీ కార్యకర్తలు గుర్తించి పోలీసులకు అప్పగించారు.