ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు
ABN , First Publish Date - 2021-10-18T04:56:38+05:30 IST
కూరగాయల ధరలు ఆకాశన్నంటాయి. మార్కెట్లో పలు కూరగాయల ధరలు కిలో రూ.40 నుంచి రూ.60 పలుకుతున్నాయి.
చాగలమర్రి, అక్టోబరు 17: కూరగాయల ధరలు ఆకాశన్నంటాయి. మార్కెట్లో పలు కూరగాయల ధరలు కిలో రూ.40 నుంచి రూ.60 పలుకుతున్నాయి. పచ్చిమిర్చి కిలో రూ.40 చేరింది. బీర, కాకర, చిక్కుడు, క్యారెట్, బీన్స్, అల్లం రూ.60 నుంచి రూ.80 పలుకుతున్నాయి. వంకాయలు, బెండకాయలు కిలో రూ.40 చేరాయి. కొత్తిమీర, పాలాకు, చుక్కాకు కట్టలు రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతున్నాయి. కూరగాయల దిగుబడులు తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు కొనలేక, తినలేక ఉన్నారు. ధరలు తగ్గేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.