కొవిడ్‌ బాధితులను ఆదుకుంటా

ABN , First Publish Date - 2021-05-09T05:49:38+05:30 IST

ప్రత్తిపాడు, మే 8: కొవిడ్‌ బాధితులను ఆదుకుంటామని ప్రత్తిపాడులో సామాజిక సేవా కార్యకర్త గోపిశెట్టి శ్రీను శనివారం బైక్‌పై మైక్‌తో ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని కొవిడ్‌ బాధితుల కుటుంబాలకు మాస్క్‌లు, శానిటైజర్లు, పండ్లు వంటివి పంపిణీ చేశారు. కరోనా వైరస్‌తో ఎవరూ భయాందోళనకు గురికావద్దని, సోకినవారికి ఎటువంటి సహాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని శ్రీను మండు టెండలో పు

కొవిడ్‌ బాధితులను ఆదుకుంటా
ప్రచారం చేస్తున్న గోపిశెట్టి శ్రీను

ప్రత్తిపాడులో సామాజిక కార్యకర్త ప్రచారం 

ప్రత్తిపాడు, మే 8: కొవిడ్‌ బాధితులను ఆదుకుంటామని ప్రత్తిపాడులో సామాజిక సేవా కార్యకర్త గోపిశెట్టి శ్రీను శనివారం బైక్‌పై మైక్‌తో ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని కొవిడ్‌ బాధితుల కుటుంబాలకు మాస్క్‌లు, శానిటైజర్లు, పండ్లు వంటివి పంపిణీ చేశారు. కరోనా వైరస్‌తో ఎవరూ భయాందోళనకు గురికావద్దని, సోకినవారికి ఎటువంటి సహాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని శ్రీను మండు టెండలో పురవీధుల్లో తిరుగుతూ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. వ్యాధిగ్రస్థుల కోసం తమతో పాటు తమ ప్రతినిధులు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, సాయం కావాల్సిన వారు 8099918888కు సంప్రదించవచ్చని శ్రీను కోరారు. 

Updated Date - 2021-05-09T05:49:38+05:30 IST