బీసీలు రాజకీయంగా ఎదిగితేనే సామాజిక అభ్యున్నతి

ABN , First Publish Date - 2022-01-26T05:56:28+05:30 IST

బీసీలు రాజకీయంగా ఎదిగినప్పుడే సామాజిక అభ్యున్నతి సాధ్యమని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు.

బీసీలు రాజకీయంగా ఎదిగితేనే సామాజిక అభ్యున్నతి
పూలే విగ్రహానికి పూలమాల వేస్తున్న కృష్ణయ్య

పీలేరు, జనవరి 25: బీసీలు రాజకీయంగా ఎదిగినప్పుడే సామాజిక అభ్యున్నతి సాధ్యమని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. తిరుపతి నుంచి మదనపల్లె వెళ్తున్న ఆయనకు మంగళవారం పీలేరు వద్ద బీసీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృష్ణయ్య స్థానిక మార్కెట్‌ యార్డు వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇప్పటికీ బడుగు, బలహీన వర్గాలు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో సామాజిక, రాజకీయ చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేష్‌, నాయకులు బాలరాజు, పురం రామయ్య, రవి, నారాయణస్వామి, సంగీత, రామకృష్ణయ్య, ప్రసన్నకుమార్‌, శ్రీరాములు, మునిరత్నం, రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T05:56:28+05:30 IST