ప్రకృతి వ్యవసాయంతో సామాజిక ఆరోగ్యం
ABN , First Publish Date - 2022-06-25T06:17:24+05:30 IST
ప్రకృతి వ్యవసాయంతో సామాజిక, శారీరక ఆరో గ్యం రెండూ బాగు పడుతాయని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. కుప్పం సచివాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల సర్పంచులకు ప్రకృతి వ్యవసాయంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
కుప్పం, జూన్ 24: ప్రకృతి వ్యవసాయంతో సామాజిక, శారీరక ఆరో గ్యం రెండూ బాగు పడుతాయని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. కుప్పం సచివాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల సర్పంచులకు ప్రకృతి వ్యవసాయంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ... ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి తక్కువ అయినా, ఆరోగ్యానికి భరోసా ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రకృతి వ్య వసాయం చేయడమేకాకుండా తమ గ్రామాల పరిధిలోని రైతులతో కూడా చేయించాలన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, విధానాలను డీపీఆర్సీ రిసోర్స్పర్సన్ షణ్ముగరాం వివరించారు. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.