Share marketలో నష్టంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-12T18:03:23+05:30 IST
షేర్ మార్కెట్లో నష్టం రావడంతో మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.
సంగారెడ్డి: షేర్ మార్కెట్ (Share market)లో నష్టం రావడంతో మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి (Sofrware employee) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఖమ్మం జిల్లా గోళ్లపాడుకు చెందిన గుడ్ల లక్ష్మీనారాయణ(37)గా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణం పీజేఆర్ కాలనీలో లక్ష్మీనారాయణ ఉంటున్నారు. కాగా షేర్ మార్కెట్లో దాదాపు రూ.20 లక్షలు నష్టం రావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.