అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-01-25T01:37:36+05:30 IST

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి గదిలో బంధించి అత్యాచా రానికి పాల్పడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

హైదరాబాద్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి గదిలో బంధించి అత్యాచా రానికి పాల్పడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన కంటే నాగేష్ ఐల్యాబ్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరానగర్ లో భార్య, ముగ్గురు పిల్లలతో కలసి అద్దెకు ఉంటున్నాడు. సమీపంలో నివసి స్తున్న ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని(17)కి కొంత కాలంగా ట్యూషన్ చెబుతున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ నెల 21న ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకునేందుకు యత్నించగా అభ్యంతరం వ్యక్తం చేసింది.


అదే రోజు రాత్రి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అప్పటికే అద్దెకు తీసుకున్న ఓ గదిలో బంధించాడు. నైట్ డ్యూటీకి వెళ్తున్నానని తన భార్యకు చెప్పి ఆ తరువాత తనపై అత్యాచారానికి పాల్పడ్డట్లుగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Updated Date - 2021-01-25T01:37:36+05:30 IST