సైనికుడి భార్య మిస్సింగ్.. గదిలో మందు బాటిళ్లు, సిగరెట్లు.. ఆమె ఫోన్ కాల్స్ పరిశీలిస్తే..

ABN , First Publish Date - 2022-03-01T05:36:36+05:30 IST

ఆమె ఓ సైనికుడి భార్య.. భర్త ఉద్యోగ నిమిత్తం వేరే ఊర్లో ఉండడంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో ఉంటోంది. ఓ కారు మెకానిక్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఐదు రోజుల క్రితం ఆమె అదృశ్యమైంది. పోలీసులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ...

సైనికుడి భార్య మిస్సింగ్.. గదిలో మందు బాటిళ్లు, సిగరెట్లు.. ఆమె ఫోన్ కాల్స్ పరిశీలిస్తే..

ఆమె ఓ సైనికుడి భార్య.. భర్త ఉద్యోగ నిమిత్తం వేరే ఊర్లో ఉండడంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో ఉంటోంది.  ఓ కారు మెకానిక్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఐదు రోజుల క్రితం ఆమె అదృశ్యమైంది. పోలీసులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు.. చివరకు ఫోన్ కాల్ ఆధారంగా ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరం రతన్‌పూర్ కాలనీకి చెందిన ఇందర్‌పాల్ అనే వ్యక్తి సీఆర్‌పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య గీతాదేవి (34) తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో ఉంటోంది. గత కొన్ని రోజులుగా భార్య తన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోకపోవడంతో.. కంగారు పడి ఇందర్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమె మొబైల్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. 


అందులో కార్ మెకానిక్ ముఖ్తార్ నుంచి ఆమెకు చివరి కాల్ వచ్చింది. దీంతో ఆ మెకానిక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమ గట్టిగా విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. తనకు గీతతో వివాహేతర సంబంధం ఉందని, తరచుగా కలుసుకునేవారమని ముఖ్తార్ చెప్పాడు. అయితే తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరొకరితో కూడా గీత తరచుగా మాట్లాడేదని ముఖ్తార్ పోలీసులకు చెప్పాడు. 


తను ఎంత వారించినా ఆమె తన మాట వినలేదని, అందుకే ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఆమెను తనతో పాటు కారులో ఊరి చివర తీసుకెళ్లి హత్య చేసి, మృతదేహాన్ని కాలువలో పడేశానని చెప్పాడు. అయితే వివాహానికి ముందు నుంచే గీతకు ముఖ్తార్‌తో సంబంధం ఉన్నట్టు పోలీసులు తేల్చారు. గీత పుట్టింటి సమీపంలో ముఖ్తార్ ఉండేవాడని.. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సంబంధాలున్నాయని తెలిసింది. పోలీసులు ప్రస్తుతం ముఖ్తార్‌ను రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-03-01T05:36:36+05:30 IST