దుబాయిలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2021-10-24T05:53:42+05:30 IST

బతుకమ్మ వేడుకలతో పాటు బుర్జు ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి దుబాయికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు శనివారం దుబాయిలో ప్రవాస తెలంగాణ పౌరులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, జాగృతి ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.

దుబాయిలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం
దుబాయిలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు,

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 23: బతుకమ్మ వేడుకలతో పాటు బుర్జు ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి దుబాయికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు శనివారం దుబాయిలో ప్రవాస తెలంగాణ పౌరులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, జాగృతి ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ చైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేష్‌గుప్తా, షకీల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ తదితరులు దుబాయికి వెళ్లారు. శనివారం రాత్రి 9.40 గంట లకు, అలాగే, 10.40 గంటలకు ప్రపంచంలోనే ఎత్తైన బుర్జు ఖలీఫాపై బతుకమ్మ వీడియోను ప్రదర్శించారు. 

Updated Date - 2021-10-24T05:53:42+05:30 IST