కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-03-01T04:09:10+05:30 IST

విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్‌ ఎలక్ర్టిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు కోరారు

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
మాట్లాడుతున్న సీఐటీయు రాష్ట్ర నాయకుడు దుగ్గిరాల సూరిబాబు

గూడూరురూరల్‌, ఫబ్రవరి 28: విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్‌ ఎలక్ర్టిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు కోరారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అర్హతవున్న సిబ్బందికి షిఫ్ట్‌ ఆపరేటర్లుగా అవకాశం కల్పించాలన్నారు. పదేళ్ల సర్వీసు పూర్తయిన కార్మికులకు ఇంక్రిమెంటు,్ల అరియర్స్‌ను ఇప్చించాలన్నారు. మీటర్‌ రీడర్లు 8 రోజుల లోగా రీడింగ్‌లను పూర్తిచేయాలని తెలుపుతున్నారన్నారు. రీడింగ్‌లు పూర్తి చేయని వారికి పని దినాలను పెంచాలన్నారు. కార్యక్రమంలో యాదగిరి, వెంకట్రామిరెడ్డి, సుమన్‌, మహేష్‌, బండి శ్రీనివాసులు, రాజమోహన్‌, ఆరీఫ్‌, అనిల్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:09:10+05:30 IST