సమస్యలను పరిష్కరిస్తాం : చైర్‌పర్సన

ABN , First Publish Date - 2021-07-25T05:43:07+05:30 IST

వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పర్యటిస్తూ పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ తెలిపారు.

సమస్యలను పరిష్కరిస్తాం : చైర్‌పర్సన
మురుగునీటిని పరిశీలిస్తున్న చైర్‌పర్సన, కమిషనర్‌

హిందూపురం టౌన, జూలై 24: వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పర్యటిస్తూ పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ తెలిపారు. శనివారం పట్టణంలోని 36వ వార్డులో కౌన్సిలర్‌ భారతి,  కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావుతో కలిసి అరవిందనగర్‌, ముద్దిరెడ్డిపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మురుగునీరు ఇళ్లముందు ఉండటం, వర్షం కారణంగా రోడ్లపై రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్‌ తెలిపారు. అహుడా నిధుల ద్వారా దండురోడ్డు వెడల్పు చేసి సీసీరోడ్డు ఏర్పాటు చేసేందుకు త్వరలోనే పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈ మల్లికార్జున, సిటీప్లానర్‌ హరిదాస్‌, శానిటరి ఇనస్పెక్టర్‌ సోమశేఖర్‌, నాయకులు, హరీష్‌, నాగేంద్ర, నాగభూషణంరెడ్డి, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T05:43:07+05:30 IST