చర్చలతో సమస్యలు పరిష్కరించుకోండి.. సౌదీ సలహా

ABN , First Publish Date - 2021-05-10T10:31:10+05:30 IST

జమ్మూకశ్మీర్‌ అంశంతో పాటు భారత్‌, పాక్‌ మధ్య ఉన్న ఇతర సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది.

చర్చలతో సమస్యలు పరిష్కరించుకోండి.. సౌదీ సలహా

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌ అంశంతో పాటు భారత్‌, పాక్‌ మధ్య ఉన్న ఇతర సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు ఈ చొరవ తీసుకోవాలని చెప్పింది. సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ఆ దేశంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ శనివారం ఓ ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఇరు దేశాల తరఫున సంయుక్త ప్రకటనను పాక్‌ విదేశాంగ శాఖ విడుదల చేసింది. 

Updated Date - 2021-05-10T10:31:10+05:30 IST