పోరాటాలతోనే ప్రజా సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2022-09-26T04:44:47+05:30 IST

పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని రైల్వేకోడూరు సీనియర్‌ సీపీఐ నాయకుడు, ఏ ఐటీయూసీ జిల్లా అధ్య క్షుడు తుమ్మల రాధాకృష్ణయ్య తె లిపారు.

పోరాటాలతోనే ప్రజా సమస్యల పరిష్కారం
మాట్లాడుతున్న తుమ్మల రాధాకృష్ణయ్య

రైల్వేకోడూరు,సెప్టెంబరు 25: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని రైల్వేకోడూరు సీనియర్‌ సీపీఐ నాయకుడు, ఏ ఐటీయూసీ జిల్లా అధ్య క్షుడు తుమ్మల రాధాకృష్ణయ్య తె లిపారు. ఆదివారం రైల్వేకోడూ రు సీపీఐ కార్యాలయంలో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబరు 14 నుంచి 18 వరకు విజయవాడలో నిర్వ హించనున్న సీపీఐ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. భారతదేశంలో విద్యార్థులు, కార్మికుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన ఘనత సీపీఐకే దక్కిందన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో పేద ప్రజలు, కార్మికులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి మాదరాజు గంగాధర్‌, ఏపీఎండీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు పోకూరి మురళి, ఏఐటీయూసీ జిల్లా సమితి కౌన్సిల్‌ సభ్యులు తుమ్మల క్రిష్ణచైతన్య, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T04:44:47+05:30 IST