కరోనాతో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-04-23T05:39:44+05:30 IST

మండలంలోని ఓ గ్రామంలో కరోనాతో ఒకరు మృతి చెందారు.

కరోనాతో ఒకరి మృతి

గజపతినగరం,  ఏప్రిల్‌ 22: మండలంలోని ఓ గ్రామంలో కరోనాతో ఒకరు మృతి చెందారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గత ఐదు రోజుల కిందట ఆర్టీపీసీఆర్‌ టెస్టు నిర్వహించగా, గురువారం వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు మరుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి ఆర్‌.నాగరాజ్‌  తెలిపారు. బాధితుడు గత కొంత కాలంగా డయాలసిస్‌తో బాధపడుతున్నట్టు చెప్పారు. ఈమేరకు గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.

 జూట్‌మిల్లు కార్మిక సంఘ నేత..

కొత్తవలస:  కొత్తవలస ఉమా జూట్‌ మిల్లు కార్మిక సంఘం నాయకుడు కరోనాతో మృతి చెందారు. ఆయన ఈనెల 14వ తేదీ నుంచి అనారోగ్యంతో ఉండ డంతో విశాఖపట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో చికిత్సపొందుతూ గురువారం ఉదయం 11 గంటలకు మృతిచెందారు. 

 

Updated Date - 2021-04-23T05:39:44+05:30 IST