ఎవరో ఈమె..!

ABN , First Publish Date - 2021-11-19T05:56:48+05:30 IST

మంత్రాలయంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వద్ద గుర్తు తెలియని ఓ యువతి దీనస్థితిలో ఉంటోంది.

ఎవరో ఈమె..!

మంత్రాలయంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వద్ద గుర్తు తెలియని ఓ యువతి దీనస్థితిలో ఉంటోంది. వానకు తడుస్తూ, చలికి వణుకుతూ కదలలేని స్థితిలో ఉంది. తన పేరు జ్యోతి అని, తండ్రి పేరు చంద్రు అని చెబుతోంది. కన్నడ భాషలో మాట్లాడుతున్న ఈ యువతి ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదని స్థానికులు అంటున్నారు. ఆమె పరిస్థితి చూసి బ్యాంకు అధికారులు, సిబ్బంది రోజూ ఆహారాన్ని అందిస్తున్నారు. స్వయంగా తినలేని స్థితిలో ఉన్న ఆమెకు వారే తినిపిస్తున్నారు. బ్యాంకు మేనేజర్‌ వీరేష్‌ కుమార్‌, ఉద్యోగులు కిరణ్‌ కుమార్‌, భరత్‌కుమార్‌, హనుమన్న, అశ్విని తదితరులు రోజూ ఆమెకు ఆహారం అందిస్తున్నారు. బ్యాంకుకు సెలవు ఉంటే ఆ రోజు పస్తు ఉంటోంది. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో సంచరించేవారు చూసి ‘అయ్యో పాపం..’ అంటున్నారే తప్ప ఆదరించే ప్రయత్నం చేయడం లేదు. చీకటి పడితే ఆ యువతికి రక్షణ లేకుండా పోతోంది. సమీపంలోని సచివాలయ ఉద్యోగులకు సమాచారం ఇస్తే, తమకు సంబంధం లేదని అంటున్నారని బ్యాంకు అధికారులు తెలిపారు. అధికారులు స్పందించి ఆ యువతిని ఏదైనా ఆశ్రమంలో చేర్పించాలని ప్రజలు కోరుతున్నారు.


 - మంత్రాలయం

Updated Date - 2021-11-19T05:56:48+05:30 IST