పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మృతి

ABN , First Publish Date - 2021-04-18T05:40:55+05:30 IST

ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవసాయశాఖ విశ్రాంత సూపరింటెండెంట్‌ కొనకంచి సోమేశ్వరరావు(72) అనారోగ్యంతో శనివారం గుంటూరులో మృతి చెందారు.

పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మృతి
కొనకంచి సోమేశ్వరరావు.

పలువురు నివాళులు

గుంటూరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవసాయశాఖ విశ్రాంత సూపరింటెండెంట్‌ కొనకంచి  సోమేశ్వరరావు(72) అనారోగ్యంతో శనివారం గుంటూరులో మృతి చెందారు. మేడికొండూరు మండలం సిరిపురం గ్రామానికి చెందిన సోమేశ్వరరావు వ్యవసాయశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత తాలూకా కార్యాలయంలోని పెన్షన్‌ భవన్‌ నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు. పెన్షన్‌భవన్‌లో సోమేశ్వరరావు మృతదేహం ఉంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, అశోక్‌బాబు, ఎన్జీవో సంఘ నాయకుడు విద్యాసాగర్‌, మహమ్మద్‌ ఇక్బాల్‌, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రామకృష్ణ, కృష్ణాజిల్లా ఎన్‌జీవో నాయకుల విద్యాసాగర్‌ తదితరులు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని శ్యామలానగర్‌లోని స్వగృహానికి తరలించారు. ఇంటి వద్ద సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి శర్మ, అదనపు కార్యదర్శులు రామానుజరావు, జగన్మోహిని, నారాయణస్వామి, గౌరికాంత్‌ జిల్లా శాఖ నాయకులు కృష్ణయ్య, ప్రభుదాస్‌, కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి, నాగేశ్వరావు, ఎం సాంబయ్య, పిచ్చయ్య, సుబ్బారావు, విఠల్‌రావు, రవిశంకర్‌ తదితరులు నివాళులర్పించారు.

Updated Date - 2021-04-18T05:40:55+05:30 IST